ETV Bharat / bharat

శ్రావణమాసం స్పెషల్​ : అరుణాచలం TO తంజావూర్​ - అతి తక్కువ ధరకే IRCTC సూపర్​​ ప్యాకేజీ! - Divya Dakshin yatra Jyotirlinga

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 19, 2024, 3:56 PM IST

IRCTC Sravan Masam Package : మరికొన్ని రోజుల్లో శ్రావణమాసం రానుంది. ఈ మాసంలో చాలా మంది ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటారు. అలాంటి వారికోసం IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి, ఆ ప్యాకేజీ ఏంటి? ఎన్ని రోజులు సాగుతుంది? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

IRCTC Sravan Masam Package
IRCTC Sravan Masam Package (ETV Bharat)

IRCTC Divya Dakshin yatra (Sravan Special): శ్రావణ మాసం హిందువులకు అత్యంత ప్రాముఖ్యత కలిగినది. వత్రాలు, పూజలు అంటూ చాలా మంది బిజీబిజీగా గడుపుతుంటారు. దేశంలోని ప్రముఖ దేవాలయాలు దర్శించుకోవాలని ప్లాన్​ చేసుకుంటుంటారు. మరి మీరు కూడా ఆ లిస్ట్​లో ఉన్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​​ అండ్​​ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. అతి తక్కువ ధరకే ప్రముఖ దేవాలయాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. మరి, ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ ద్వారా శ్రావణ మాసం స్పెషల్​గా ఐఆర్​సీటీసీ "దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ" పేరుతో ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ రైలు ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్ మొదలు వరుసగా కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా జర్నీ ఉంటుంది. ఈ స్టేషన్లలో ట్రైన్ ఎక్కొచ్చు. ప్రయాణం అయిపోయాక పైన తెలిపిన స్టేషన్లలో దిగొచ్చు. ఇక ఈ టూర్ మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లు సాగుతుంది. మరి ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు సికింద్రాబాద్​ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ స్టార్ట్​ అవుతుంది. కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై రైల్వేస్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. అక్కడ ప్రెషప్​ అయ్యి.. అరుణాచలం ఆలయం దర్శించుకుంటారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్‌కు వచ్చి కుదాల్​నగర్​ స్టార్ట్​ అవుతారు.
  • మూడో రోజు ఉదయం కుదాల్​నగర్​ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రామేశ్వరం చేరుకుంటారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అవుతారు. తర్వాత ఫ్రెష్​ అయ్యి స్థానికంగా ఉన్న దేవాలయాలను దర్శించుకుంటారు. సాయంత్రం తిరిగి హోటల్​కు చేరుకుని ఆ రాత్రి అక్కడే భోజనం చేసి స్టే చేస్తారు.
  • నాలుగోరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత రామేశ్వరం నుంచి బస్సు ప్రయాణం ద్వారా మదురై స్టార్ట్​ అవుతారు. సాయంత్రం మీనాక్షి అమ్మన్​ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత షాపింగ్​ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అనంతరం కుదాల్​నగర్​ రైల్వేస్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి కన్యాకుమారికి ట్రైన్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది.
  • ఐదో రోజు ఉదయం కొచ్చువేలి స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కన్యాకుమారి చేరుకుంటారు. హోటల్​లో చెకిన్​ అయ్యి ఫ్రెషప్​ అనంతరం రాక్​ మెమోరియల్​, గాంధీ మండపం, సూర్యాస్తమయం సందర్శిస్తారు. తిరిగి హోటల్​కు చేరుకుని భోజనం ముగించి ఆ రాత్రికి కన్యాకుమారిలో స్టే చేస్తారు.

సౌత్​ ఇండియాలోని ఈ ఆలయాలు చూసొస్తారా? - వైజాగ్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! ధర కూడా అందుబాటులోనే!

  • ఆరో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ అనంతరం హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి రోడ్డు మార్గం ద్వారా త్రివేండ్రం స్టార్ట్​ అవుతారు. అక్కడికి చేరుకున్న తర్వాత పద్మనాభ స్వామి ఆలయం దర్శించుకుంటారు. ఆ తర్వాత కొద్దిసేపు కోవలం బీచ్​లో ఎంజాయ్​ చేస్తారు. అక్కడి నుంచి కొచ్చువేలి స్టేషన్​కు చేరుకుని అక్కడి నుంచి తిరుచిరాపల్లి బయలుదేరుతారు.
  • ఏడో రోజు ఉదయం తిరుచిరాపల్లి చేరుకుని హోటల్​లో ఫ్రెషప్​ అనంతరం శ్రీరంగం టెంపుల్​ దర్శించుకుంటారు. మధ్యాహ్నం భోజనం తర్వాత తంజావూర్​ స్టార్ట్​ అవుతారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని దర్శించుకుని.. అక్కడి నుంచి తంజావూర్​ రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్​కు స్టార్ట్​ అవుతారు.
  • 8వ రోజు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్​, కాజీపేట మీదుగా 9వ రోజు ఉదయం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో దివ్య దర్శన యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజీ ధరలు చూస్తే..

  • ఎకానమీ: పెద్దలకు రూ.14,250, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.13,250గా నిర్ణయించారు.
  • స్టాండర్డ్​: పెద్దలకు రూ.21,900, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.20,700గా నిర్ణయించారు.
  • కంఫర్ట్​: పెద్దలకు రూ.28,450, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.27,010గా ధరలు నిర్ణయించారు.
  • ప్రస్తుతం ఈ టూర్​ ఆగష్టు 4వ తేదీన ప్రారంభం కానుంది.
  • ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం రైల్వే సిబ్బంది చూసుకుంటారు.
  • ప్యాకేజ్​ను బట్టి ప్రయాణానికి ఏసీ లేదా నాన్​ ఏసీ వెహికిల్ సమకూరుస్తారు.
  • టూరిస్టులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించి వివరాలు, టూర్​ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

కృష్ణుడు ఏలిన ద్వారక చూసొస్తారా? తక్కువ ధరకే IRCTC ప్రత్యేక ప్యాకేజీ! మరెన్నో ప్రదేశాలు కూడా!

హైదరాబాద్​ టూ అయోధ్య వయా కాశీ - IRCTC సూపర్​ ప్యాకేజీ - ధర కూడా తక్కువే!

IRCTC Divya Dakshin yatra (Sravan Special): శ్రావణ మాసం హిందువులకు అత్యంత ప్రాముఖ్యత కలిగినది. వత్రాలు, పూజలు అంటూ చాలా మంది బిజీబిజీగా గడుపుతుంటారు. దేశంలోని ప్రముఖ దేవాలయాలు దర్శించుకోవాలని ప్లాన్​ చేసుకుంటుంటారు. మరి మీరు కూడా ఆ లిస్ట్​లో ఉన్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​​ అండ్​​ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. అతి తక్కువ ధరకే ప్రముఖ దేవాలయాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. మరి, ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ ద్వారా శ్రావణ మాసం స్పెషల్​గా ఐఆర్​సీటీసీ "దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ" పేరుతో ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ రైలు ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్ మొదలు వరుసగా కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా జర్నీ ఉంటుంది. ఈ స్టేషన్లలో ట్రైన్ ఎక్కొచ్చు. ప్రయాణం అయిపోయాక పైన తెలిపిన స్టేషన్లలో దిగొచ్చు. ఇక ఈ టూర్ మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లు సాగుతుంది. మరి ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు సికింద్రాబాద్​ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ స్టార్ట్​ అవుతుంది. కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై రైల్వేస్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. అక్కడ ప్రెషప్​ అయ్యి.. అరుణాచలం ఆలయం దర్శించుకుంటారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్‌కు వచ్చి కుదాల్​నగర్​ స్టార్ట్​ అవుతారు.
  • మూడో రోజు ఉదయం కుదాల్​నగర్​ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రామేశ్వరం చేరుకుంటారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అవుతారు. తర్వాత ఫ్రెష్​ అయ్యి స్థానికంగా ఉన్న దేవాలయాలను దర్శించుకుంటారు. సాయంత్రం తిరిగి హోటల్​కు చేరుకుని ఆ రాత్రి అక్కడే భోజనం చేసి స్టే చేస్తారు.
  • నాలుగోరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత రామేశ్వరం నుంచి బస్సు ప్రయాణం ద్వారా మదురై స్టార్ట్​ అవుతారు. సాయంత్రం మీనాక్షి అమ్మన్​ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత షాపింగ్​ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అనంతరం కుదాల్​నగర్​ రైల్వేస్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి కన్యాకుమారికి ట్రైన్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది.
  • ఐదో రోజు ఉదయం కొచ్చువేలి స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కన్యాకుమారి చేరుకుంటారు. హోటల్​లో చెకిన్​ అయ్యి ఫ్రెషప్​ అనంతరం రాక్​ మెమోరియల్​, గాంధీ మండపం, సూర్యాస్తమయం సందర్శిస్తారు. తిరిగి హోటల్​కు చేరుకుని భోజనం ముగించి ఆ రాత్రికి కన్యాకుమారిలో స్టే చేస్తారు.

సౌత్​ ఇండియాలోని ఈ ఆలయాలు చూసొస్తారా? - వైజాగ్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! ధర కూడా అందుబాటులోనే!

  • ఆరో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ అనంతరం హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి రోడ్డు మార్గం ద్వారా త్రివేండ్రం స్టార్ట్​ అవుతారు. అక్కడికి చేరుకున్న తర్వాత పద్మనాభ స్వామి ఆలయం దర్శించుకుంటారు. ఆ తర్వాత కొద్దిసేపు కోవలం బీచ్​లో ఎంజాయ్​ చేస్తారు. అక్కడి నుంచి కొచ్చువేలి స్టేషన్​కు చేరుకుని అక్కడి నుంచి తిరుచిరాపల్లి బయలుదేరుతారు.
  • ఏడో రోజు ఉదయం తిరుచిరాపల్లి చేరుకుని హోటల్​లో ఫ్రెషప్​ అనంతరం శ్రీరంగం టెంపుల్​ దర్శించుకుంటారు. మధ్యాహ్నం భోజనం తర్వాత తంజావూర్​ స్టార్ట్​ అవుతారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని దర్శించుకుని.. అక్కడి నుంచి తంజావూర్​ రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్​కు స్టార్ట్​ అవుతారు.
  • 8వ రోజు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్​, కాజీపేట మీదుగా 9వ రోజు ఉదయం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో దివ్య దర్శన యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజీ ధరలు చూస్తే..

  • ఎకానమీ: పెద్దలకు రూ.14,250, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.13,250గా నిర్ణయించారు.
  • స్టాండర్డ్​: పెద్దలకు రూ.21,900, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.20,700గా నిర్ణయించారు.
  • కంఫర్ట్​: పెద్దలకు రూ.28,450, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.27,010గా ధరలు నిర్ణయించారు.
  • ప్రస్తుతం ఈ టూర్​ ఆగష్టు 4వ తేదీన ప్రారంభం కానుంది.
  • ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం రైల్వే సిబ్బంది చూసుకుంటారు.
  • ప్యాకేజ్​ను బట్టి ప్రయాణానికి ఏసీ లేదా నాన్​ ఏసీ వెహికిల్ సమకూరుస్తారు.
  • టూరిస్టులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించి వివరాలు, టూర్​ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

కృష్ణుడు ఏలిన ద్వారక చూసొస్తారా? తక్కువ ధరకే IRCTC ప్రత్యేక ప్యాకేజీ! మరెన్నో ప్రదేశాలు కూడా!

హైదరాబాద్​ టూ అయోధ్య వయా కాశీ - IRCTC సూపర్​ ప్యాకేజీ - ధర కూడా తక్కువే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.