తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2022, 1:47 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

ETV Bharat / videos

బ్రస్సెల్స్​లో కనులపండువగా శ్రీ శ్రీనివాస కల్యాణం

Lord Srinivas Kalyanam in Brussels: పాశ్చాత్య దేశంలో తెలుగువారి సంస్కృతి ఉట్టిపడింది. కలియుగ దైవం వేంకటేశ్వరుడి కల్యాణం కమనీయంగా జరిగింది. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్​లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ నెల 6న అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కల్యాణం జరిపించారు. నిర్వాహకులు కొండయ్య కావూరి, వరికుంట్ల రాజేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కల్యాణానికి దాదాపు 500 మంది దాకా భక్తులు పాల్గొన్నారు. 2018 నుంచి స్వామి వారి కల్యాణం జరిపిస్తుండగా.. కరోనా కారణంగా రెండేళ్లు నిర్వహించలేదు. ఈ ఏడాది ఘనంగా నిర్వహించారు. శ్రీనివాసుని వివాహ వేడుకలో చిన్నారుల నృత్యాలతో మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details