పశ్చిమ దేశాల్లో క్రిస్మస్ సందడి ఆకట్టుకుంటోంది. ముందస్తు సంబరాల్లో భాగంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్లో ఇద్దరు వ్యక్తులు శాంటాక్లాజ్, దేవదూత వేషధారణలో సముద్రజీవులకు ఆహారం అందించారు. బెర్లిన్ ఆక్వేరియంలో దిగి చేపలు, ఇతర జీవులకు ఆహారం పెట్టారు. 'సీలైఫ్' పేరుతో బెర్లిన్లో ఏర్పాటు చేసిన ఆక్వేరియంలో 5 వేల జాతుల జీవులున్నాయి.