యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని చాలా రోజుల తర్వాత తెరిచారు. మొదటగా స్థానికులు, ఆలయ సిబ్బంది, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా దర్శనాలు కల్పిస్తున్నారు. రేపటి నుంచి భక్తులందరికీ స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం కలెక్టర్ అనితా రామచంద్రన్, ట్రైనీ కలెక్టర్ గరీమా అగర్వాల్ స్వామివారిని దర్శించుకున్నారు.
భక్తులంతా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి తొందరగా కనుమరుగయ్యేలా చూడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.