తెలంగాణ

telangana

ETV Bharat / state

వైన్స్​షాపులో చోరీ.. రెండు కాటన్ల మద్యం లూటీ..

లాక్​డౌన్​ నేపథ్యంలో ఏప్రిల్​ 14వరకు మద్యం దుకాణాలు బంద్​ కారణంగా.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లోని ఓ వైన్స్​షాపులో దొంగతనం జరిగింది. ఈ చోరీలో కొంత నగదు రెండు కాటన్ల మద్యం దొంగతనానికి గురైనట్టు పోలీసులు తెలిపారు.

By

Published : Mar 28, 2020, 3:57 PM IST

Breaking News

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని లింగోజిగూడెం శ్రీ సాయి వైన్స్ దుకాణం తాళాలు పగులగొట్టి మరీ అగంతకులు దొంగతనం చేశారు. ఈ చోరీలో కొంత నగదు, రెండు కాటన్ల మద్యం చోరీ అయినట్టు పోలీసులు గుర్తించారు.

శుక్రవారం రాత్రి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి దొంగతనానికి పాల్పడినట్టు స్థానికులు పోలీసులకు తెలిపారు. చుట్టుపక్కల వారి సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న చౌటుప్పల్​ ఇన్​స్పెక్టర్​ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

లాక్​డౌన్​ ఎఫెక్ట్​: వైన్స్​షాపులో చోరీ.. రెండు కాటన్ల మద్యం మాయం

ఇదీ చదవండి: విస్తరిస్తున్న కరోనా... ఒక్కరోజే 14 మందికి

ABOUT THE AUTHOR

...view details