తెలంగాణ

telangana

By

Published : Sep 7, 2020, 4:47 AM IST

ETV Bharat / state

వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలతో వైద్య ఆరోగ్యశాఖ టెలికాన్ఫరెన్స్

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్​పై... సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని వైద్య సిబ్బంది, ఆశాకార్యకర్తలకు టెలికాన్ఫరెన్స్​ నిర్వహించారు. వైరస్ బాధితులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

teleconference with anms and asha valaunnteers in nagarama mandal
వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలతో వైద్య ఆరోగ్యశాఖ టెలికాన్ఫరెన్స్

సూర్యాపేట జిల్లా నాగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో... రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్​పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ సోకిన వారికి మెరుగైన సేవలు అందించాలని... ఏఎన్​ఎంలు, ఆశా కార్యకర్తలకు సూచించారు. కరోనా నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ఐసోలేషన్లు, హాం క్వారంటైన్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

కరోనాను అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పవన్ కుమార్, పీహెచ్​ఎన్ ధనమ్మ, హెల్త్ సూపర్​వైజర్ మార్​ నాత, నాగమ్మ, జయమ్మ, ఇందిరా, విజయలక్ష్మి, రోజా, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details