తెలంగాణ

telangana

By

Published : Jan 7, 2020, 10:33 AM IST

Updated : Jan 7, 2020, 2:40 PM IST

ETV Bharat / state

హత్యకు ప్రతీకారం... నిందితుడి ఇల్లు దహనం

protest-a
protest-a

07:03 January 07

.

ఉద్రిక్తత.. హత్య కేసులో నిందితుడి ఇంటికి నిప్పు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండలో సోమవారం రాత్రి కన్‌రెడ్డి వెంకటరెడ్డి(38) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయాన్నే గ్రామస్థులంతా కలిసి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దానబోయిన పరశురాములు ఇంటికి నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న ఆలేరు ఎస్సై రమేశ్‌ గొలనుకొండ చేరుకుని పరిస్థితి అదుపు చేశారు.   గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరితో కలివిడిగా ఉండే వెంకట్ రెడ్డి హత్యకు గురికావడంతో గ్రామంలో విషాద ఛాయలు అల ముకున్నాయి.

మాటువేసి మట్టు బెట్టారు..

వెంకటరెడ్డి భార్య భాగ్యతో కలిసి నిన్న మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై జనగామకు వెళ్లారు. పనులు ముగించుకుని స్వగ్రామానికి వస్తున్న క్రమంలో సిరిపురం-గొలనుకొండ రహదారిలో హత్యకు గురయ్యారు. దారి పక్కన చెట్ల మాటున మాటు వేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప వస్తువుతో పొడవడంతో  వెంకటరెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య భాగ్యకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇదీ చదవండిః 2020లో టీ హబ్‌ రెండో దశ ప్రారంభం: కేటీఆర్

Last Updated : Jan 7, 2020, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details