తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రీశుడికి లక్షపుష్పార్చన - యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి లక్షపుష్పార్చన

ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బాల ఆలయ మండపంలో స్వామిఅమ్మ వార్లకు లక్ష పుష్పార్చన నిర్వహించారు. కరోనా ప్రభావం వల్ల భక్తులు లేకుండా అర్చకులు పూజా క్రతువును గావించారు.

one lakh puspa archana in yadadri laxminarasima swamy
యాదాద్రీశుడికి లక్షపుష్పార్చన

By

Published : Apr 4, 2020, 3:00 PM IST

యాదాద్రి భువనగరి జిల్లాలో కొలువై ఉన్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి బాల ఆలయంలో ఏకాంత సేవలో స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అర్చించారు.

ప్రతి మాసంలోని శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి పర్వదినాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజా క్రతువు నిర్వహించడం ఆనవాయితీ. కరోనా ప్రభావం వల్ల భక్తులను అనుమతించలేదు. అర్చకుల సమక్షంలో పూజలు చేశారు.

యాదాద్రీశుడికి లక్షపుష్పార్చన

ఇవీ చూడండి: ర్యాపిడ్ టెస్టింగ్ కిట్​తో ఇంటివద్దే కరోనా పరీక్షలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details