ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు ఐఏఎస్లు సోమేశ్ కుమార్, పార్థసారథి, జనార్ధన్ రెడ్డి, నర్సింగ్ రావు కూడా వచ్చారు. వీరికి ఆలయన అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరు స్వామివారికి ప్రత్యేకు పూజలు చేశారు. వేదపండితులు ఎస్కే జోషి, ఐఏఎస్లకు ప్రత్యేక ఆశీర్వచనాలిచ్చారు. ఆలయ ఈఓ గీతారెడ్డి స్వామివారికి లడ్డూ ప్రసాదం అందజేశారు. వీరి వెంట యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం కొండ కింద దేవస్థానం తోటలో ఏర్పాటు చేసిన వన భోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎస్కే జోషి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా మరో నలుగురు ఐఏఎస్లు ఈ రోజు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకన్నారు.
లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎస్కే జోషి
TAGGED:
CS SK JOSHI LATEST NEWS