తెలంగాణ

telangana

ETV Bharat / state

పేద ముస్లింలకు రంజాన్​ తోఫా

ప్రభుత్వ ఆదాయం తగ్గినా, కరోనా నేపథ్యంలో వితప్కర పరిస్థితి వచ్చినా పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్​ తోఫా పంపిణీ చేశారు.

By

Published : May 19, 2020, 4:34 PM IST

bhunaghiri-mla-paila-shekar-reddy-distributes-essential-commodities-as-ramazan-festival-for-poor-muslims
పేద ముస్లింలకు రంజాన్​ తోఫా

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా 4వేల ముస్లిం కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుస్తువులను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి సాయం చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనాతో జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details