తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నివర్గాల అభ్యున్నతే తెరాస లక్ష్యం: ఎమ్మెల్యే రమేశ్

పేదల జీవితంలో వెలుగు నింపడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. నియోజకవర్గంలోని విలీన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గుండ్ల సింగరంలో రూ. 2 కోట్లతో చేపడుతున్న రహదారి పనుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

By

Published : Jan 27, 2021, 4:57 PM IST

mla aruri ramesh at Gundla Singaram  inauguration of the road works being carried out with 2 crores
రహదారి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి రమేష్

అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ స్పష్టం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని హాసన్​పర్తి మండలం గుండ్ల సింగరంలో రూ. 2 కోట్లతో చేపడుతున్న రహదారి పనులను ఆయన ప్రారంభించారు.

నియోజకవర్గంలోని విలీన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నిధులు సేకరించి విలీన గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్నారని వెల్లడించారు. పేదల జీవితంలో వెలుగు నింపడమే తెరాస ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఆ పని తప్పని చెప్పినందుకు.. పోలీసులనే కొట్టాడు

ABOUT THE AUTHOR

...view details