తెలంగాణ

telangana

'ఎల్​ఆర్​ఎస్​ తీసుకొచ్చి ప్రజల నడ్డి విరుస్తున్నారు'

By

Published : Sep 22, 2020, 3:29 PM IST

ఎల్​ఆర్​ఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ... వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని కలెక్టరేట్​ను భాజపా శ్రేణులు ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, భాజపా నాయకులకు తోపులాట చోటుచేసుకుంది.

'ఎల్​ఆర్​ఎస్​ తీసుకొచ్చి ప్రజల నడ్డి విరుస్తున్నారు'
'ఎల్​ఆర్​ఎస్​ తీసుకొచ్చి ప్రజల నడ్డి విరుస్తున్నారు'

ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. వరంగల్​లో భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఎల్​ఆర్​ఎస్ విధానానికి వ్యతిరేకంగా హన్మకొండలోని కలెక్టరేట్​ను ముట్టడించే ప్రయత్నం చేశారు. భాజపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, భాజపా శ్రేణులకు తోపులాట చోటుచేసుకుంది.

గేటు ఎక్కేందుకు ప్రయత్నం

మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని నాయకులు మండిపడ్డారు. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించలేదని మండిపడ్డారు. కరోనా సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఎల్​ఆర్​ఎస్ తీసుకొచ్చి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: కేటీఆర్​ అబద్ధాలు చెప్పుడు మానాలి : ఎంపీ అర్వింద్​

ABOUT THE AUTHOR

...view details