తెలంగాణ

telangana

కలకలం సృష్టిస్తోన్న సీఆర్పీఎఫ్ జవాన్ అదృశ్యం

By

Published : Apr 3, 2019, 2:02 PM IST

ఎన్నికల విధుల కోసం వచ్చిన జవాన్ అదృశ్యమైన ఘటన పరిగిలో జరిగింది. ఊరు కానీ ఊరుకు వచ్చి అదృశ్యం కావడంతో తోటి సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు.

పరిగిలో జవాన్ అదృశ్యం

పరిగిలో జవాన్ అదృశ్యం
వికారాబాద్ జిల్లా పరిగిలో సీఆర్పీఎఫ్ జవాన్ అదృశ్యమైన ఘటన కలకలం సృష్టిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల బందోబస్తు కోసం జార్ఖండ్ నుంచి 79 మంది పరిగికి వచ్చారు. వారికి నూతనంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రి భవనంలో బస కల్పించారు. నిన్న ఉదయం 7 గంటలకు బయటకు వెళ్లిన వ్యక్తి సాయంత్రం అయినా రాకపోవటం వల్ల తోటి జవాన్లు కంగారు పడ్డారు. ఉన్నతాధికారి సహాయంతో స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details