తెలంగాణ

telangana

By

Published : Jul 5, 2021, 9:49 PM IST

ETV Bharat / state

యూపీలో జడ్పీ ఛైర్​పర్సన్​గా సూర్యాపేట మహిళ

సూర్యాపేట జిల్లాకు చెందిన శ్రీ కళారెడ్డి.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జన్పూర్‌ జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా భాజపా నుంచి ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కుమార్తె ఈమె.

యూపీలో జడ్పీ ఛైర్​పర్సన్​గా సూర్యాపేట మహిళ
యూపీలో జడ్పీ ఛైర్​పర్సన్​గా సూర్యాపేట మహిళ

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి ఉత్తర్‌ప్రదేశ్‌లోని జన్పూర్‌ జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా భాజపా నుంచి ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కుమార్తె ఈమె.

గతంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న శ్రీకళారెడ్డికి.. యూపీకి చెందిన ధనుంజయ్‌తో వివాహమైంది. అనంతరం భాజపాలో చేరారు. ఇటీవల అక్కడ జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో పోటీచేసి జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జన్పూర్‌ పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు.

ఇదీ చూడండి:రూ.10తో లక్షలు సంపాదించడం ఎలా?

ABOUT THE AUTHOR

...view details