తెలంగాణ

telangana

ETV Bharat / state

కరెంట్​ తీగలు తగిలి ట్రాక్టర్​ దగ్ధం

గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్​కు ప్రమాదవశాత్తు కరెంట్​ తీగలు తగిలి పూర్తిగా దగ్ధమైన ఘటన సూర్యాపేట జిల్లా కొండాపురంలో జరిగింది. కరెంటు తీగలు కిందికి ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

By

Published : Nov 22, 2019, 5:08 PM IST

కరెంట్​ తీగలు తగిలి ట్రాక్టర్​ దగ్ధం

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురం స్టేజీ వద్ద గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ కరెంట్​ తీగలు తగిలి ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. బేతవోలు గ్రామానికి చెందిన రైతు కొండాపురం నుంచి ట్రాక్టర్​లో గడ్డిని తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో చుట్టుపక్కల వారు ఆపడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. స్వల్పగాయాలతో డ్రైవర్ బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. కరెంటు తీగలు కిందికి ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

కరెంట్​ తీగలు తగిలి ట్రాక్టర్​ దగ్ధం

ABOUT THE AUTHOR

...view details