తెలంగాణ

telangana

'ఎన్ని కుట్రలు చేసినా హుజూర్​నగర్​లో తెరాసదే విజయం'

By

Published : Oct 18, 2019, 10:43 PM IST

హుజూర్​నగర్​ ప్రచారంలో కాంగ్రెస్​ పార్టీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి మండిపడ్డారు. ఎంపీ రేవంత్​రెడ్డి, కోమటిరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమంగా హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

PALLA RAJESHWAR REDDY ON REVNATHRADDY, KOMATIREDDY IN HUZURNAGAR BY ELECTIONS

ప్రతిపక్షాలు ఎన్నికుట్రలు చేసినా అంతిమంగా హుజూర్​నగర్​లో తెరాస జెండా ఎగటం ఖాయమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి స్పష్టం చేశారు. ప్రచార సమయంలో ఎంపీ రేవంత్​రెడ్డి, కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హుజుర్​నగర్​లో పద్మావతికి టికెట్ ఇవోద్దని వ్యతిరేఖించిన రేవంత్​రెడ్డి... ఎన్నికల ప్రచారంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. కోమటిరెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని పల్లా హితవు పలికారు.

'ఎన్ని కుట్రలు చేసినా హుజూర్​నగర్​లో తెరాసదే విజయం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details