సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల రఘునాధపాలెం గ్రామంలో తన స్నేహితుడైన మౌలాలి తండ్రి షేక్ జాన్ దశదిన ఖర్మ కార్యక్రమానికి సినీ నటుడు అలీ హాజరయ్యారు. అనారోగ్యంతో చనిపోయిన మిత్రుడి నాన్నకు నివాళులర్పించారు.
కార్యక్రమంలో అలీతోపాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు. షేక్ జాన్ బొగ్గుల వ్యాపారం చేసేవారు. ఇతన్ని గ్రామంలో బొగ్గుల జానీగా పిలిచేవారు.