తెలంగాణ

telangana

By

Published : Jun 1, 2020, 10:39 PM IST

ETV Bharat / state

రైతే ధర నిర్ణయించే పరిస్థితి రావాలి: మంత్రి జగదీశ్​రెడ్డి

పండించిన పంటకు రైతే ధర నిర్ణయించే పరిస్థితి రావాలన్నదే సీఎం కేసీఆర్​ ఉద్దేశమని విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి రైతు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు.

minister jagadesh redd
రైతే ధర నిర్ణయించే పరిస్థితి రావాలి: మంత్రి జగదీశ్​రెడ్డి

పండించిన పంటకు రైతే ధర నిర్ణయించే పరిస్థితి రావాలన్నదే సీఎం కేసీఆర్​ ఉద్దేశమని మంత్రి జగదీశ్​రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి రైతు అవగాహన సదస్సులో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ ఛైర్​ పర్సన్​ గుజ్జ దీపిక యుగంధర్​రావు, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్​తో కలిసి మంత్రి పాల్గొన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్​ ఇస్తున్నామని.. సబ్సిడీలపై పరికరాలను అందిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్​ఫెడ్ కార్పొరేషన్​ ఛైర్మన్​ కంచర్ల రామకృష్ణారెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జేసీ సంజీవరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవీచూడండి:కాన్వాయ్ ఆపి మరి... ఎండిన మొక్కల దాహం తీర్చిన మంత్రి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details