పండించిన పంటకు రైతే ధర నిర్ణయించే పరిస్థితి రావాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి రైతు అవగాహన సదస్సులో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ ఛైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్రావు, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని.. సబ్సిడీలపై పరికరాలను అందిస్తున్నామన్నారు.
రైతే ధర నిర్ణయించే పరిస్థితి రావాలి: మంత్రి జగదీశ్రెడ్డి
పండించిన పంటకు రైతే ధర నిర్ణయించే పరిస్థితి రావాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి రైతు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు.
రైతే ధర నిర్ణయించే పరిస్థితి రావాలి: మంత్రి జగదీశ్రెడ్డి
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జేసీ సంజీవరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి:కాన్వాయ్ ఆపి మరి... ఎండిన మొక్కల దాహం తీర్చిన మంత్రి