'పుల్లూరు బండను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం'
స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. త్వరలోనే కాళేశ్వరం నుంచి సిద్దిపేటకు నీళ్లు వస్తాయని తెలిపారు.
'పుల్లూరు బండను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం'
మాఘ మాసం జాతరలో పవిత్ర స్నానాలు చేసే రోజున స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. పుల్లూరు బండ జాతర తెలంగాణ పల్లెల పండుగకు నిదర్శనమని పేర్కొన్నారు. పుల్లూరుబండను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండి : 'అమీన్పూర్ అత్యాచారం ఘటన అంతా కట్టుకథే'