ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కేవలం అటవీశాఖ మాత్రమే కాకుండా... ముఖ్యమంత్రి పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యం అయ్యాయని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించి అటవీ పునరుద్ధరణ పనులను పరిశీలించారు.
అటవీ పునరుద్ధరణకు పోలీసుల సహకారం అందిస్తాం: డీజీపీ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో... పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అటవీ అభివృద్ధి పనులు, కొండపోచమ్మ జలాశయం ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణం, మిషన్ భగీరథ భవనం సందర్శించారు.
అటవీ పునరుద్ధరణకు పోలీసుల సహకారం అందిస్తాం: డీజీపీ
అడవుల ప్రాధాన్యత, ఆవశ్యకత దృష్ట్యా... అడవులు పునరుద్ధరణకు పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో సంపూర్ణ సహకారం అందేలా చూస్తామని డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామా రెడ్డి, పోలీస్ కమీషనర్ జోయల్ డేవిస్, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ రావు, గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అధికారి ఇ ముత్యంరెడ్డి, డీఆర్డీవో విజయేందర్ రెడ్డి, గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామారావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:జీహెచ్ఎంసీలో వరదసాయానికి ఎస్ఈసీ బ్రేక్