సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కరోనా వైరస్ బారినపడి హోమ్ ఐసోలేషన్లో ఉన్నకుటుంబాలను భాజపా నాయకులు పరామర్శించారు. వారికి మనోధైర్యాన్ని నింపేప్రయత్నం చేశారు. వైరస్ సోకినవారి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారిని ప్రత్యేక ప్యాకేజీతో ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కొవిడ్ బాధితులను ప్రత్యేక ప్యాకేజీతో ఆదుకోవాలి: భాజపా
కొవిడ్ బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని... ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి వారిని ఆదుకోవాలని హుస్నాబాద్ భాజపా పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో హోమ్ ఐసోలేషన్లో ఉన్న కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించారు.
కొవిడ్ బాధితులను ప్రత్యేక ప్యాకేజీతో ఆదుకోవాలి: భాజపా
మా పరిస్థితి దారుణంగా ఉందని, పట్టించుకునే వారేలేదని వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వైద్యులు, అధికారులకు ఫోన్ చేస్తే లిప్ట్ చేయడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరకులు అందజేయాలని కోరారు. మున్సిపల్ కమిషనర్, ఛైర్మైన్, అధికారులు.. వైరస్ను నిర్ములించడంలో పూర్తిగా విఫలం చెందారని స్థానికులు ఆరోపించారు.