తెలంగాణ

telangana

By

Published : Dec 20, 2019, 3:09 PM IST

ETV Bharat / state

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Person suicide with family strife
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో నిరంజన్ (27) అనే వ్యక్తి ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ రెడ్డి కాలనీకి చెందిన నిరంజన్​కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

గత కొంతకాలంగా మద్యం సేవించి భార్యను వేధిస్తుండడం వల్ల.. భార్య తన తల్లి, సోదరుని సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం పోలీసులు ఇరువురుకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు పట్టణ సీఐ వెంకటేశ్​ తెలిపారు.

తన మృతికి అత్త, బావమరిదే కారణమంటూ నిరంజన్​ సూసైడ్ లేఖ రాసి ఉరి వేసుకున్నాడు. నిరంజన్​పై గతంలో 3 దొంగతనాల కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ఇవీ చూడండి : ప్రాణం మీదికొచ్చిన చిన్నపాటి గొడవ

ABOUT THE AUTHOR

...view details