తెలంగాణ

telangana

By

Published : Apr 10, 2021, 6:02 PM IST

ETV Bharat / state

ఆ గ్రామంలో పదిరోజుల పాటు స్వచ్ఛంద లాక్​డౌన్​

కరోనా రెండో దశ వ్యాప్తి దృష్ట్యా రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద గ్రామస్థులు స్వచ్ఛంద లాక్​డౌన్​ ప్రకటించుకున్నారు. కొవిడ్​ నిబంధనలు పాటించని వారికి రూ.1000 జరిమానా విధించేలా పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది.

lockdown in mogiligidda
మొగిలిగిద్దలో లాక్​డౌన్​

కరోనా రెండో దశ వ్యాప్తి విజృంభిస్తుండటంతో పలు గ్రామాలు స్వచ్ఛంద లాక్​డౌన్​ను ప్రకటించుకుంటున్నాయి. రంగారెడ్డి జిల్లా ఫరూక్​నగర్​ మండలం మొగిలిగిద్ద గ్రామంలో పలువురు కొవిడ్​ బారిన పడటంతో ఈ నెల 20 వరకు పంచాయతీ పాలకవర్గం స్వచ్ఛంద లాక్​డౌన్​ ప్రకటించింది. నిబంధనలు పాటించనివారికి రూ.1000 జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. గ్రామస్థులంతా అప్రమత్తంగా ఉండి వైరస్​ వ్యాప్తిని నివారించాలని ఎంపీడీవో చంద్రబాబు సూచించారు.

స్థానిక ఉర్దూ మీడియం పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామస్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. 108 మందికి టెస్టులు చేయగా అందులో 10మందికి వ్యాధి నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:కంది, పత్తి, నూనె గింజల సాగు పెంచాలి: నిరంజన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details