తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫార్మా కంపెనీలు నమ్మకాన్ని చూరగొనాలి: ఈటల

హయత్ నగర్​లో ఏర్పాటు చేసిన రిబేట్ ఫార్మసీ దక్షిణాది కార్యాలయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ప్రారంభించారు. పేదలకు నాణ్యమైన మందులను అందించాలని కోరారు.

By

Published : Jul 29, 2019, 7:39 PM IST

ఫార్మా కంపెనీలు ప్రజల నమ్మకాన్ని చూరగొనాలి: ఈటల

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్​లో ఏర్పాటు చేసిన ఫార్మసీ దక్షిణాది కార్యాలయాన్ని మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఫార్మా కంపెనీలు నాణ్యమైన మందులను తక్కువ ధరలకు అందించి, ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రజలు వైద్యం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రియదర్శిని, సంధ్యారాణి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

ఫార్మా కంపెనీలు ప్రజల నమ్మకాన్ని చూరగొనాలి: ఈటల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details