రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగనూరులోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నూతనంగా నిర్మించిన ఇంట్లో గృహప్రవేశం జరుగుతున్న సమయంలో.. గ్యాస్ సిలిండర్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఒక బాలుడు సహా ఐదుగురికి గాయాలయ్యాయి.
గృహ ప్రవేశంలో విషాదం... గ్యాస్ లీకై ఐదుగురికి గాయాలు..
రంగారెడ్డి జిల్లా మునగనూరులోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి.
గ్యాస్ సిలిండర్ లీకై ఐదుగురికి గాయాలు
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సిలిండర్ను ఇంటి బయట గల ఖాళీ ప్రదేశానికి తరలించారు. క్షతగాత్రులను వెంటనే హయత్నగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తీవ్ర గాయాలైన ఇద్దరిని అపోలో ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి:టీఎస్రెడ్కో కుంభకోణంలో కొనసాగుతోన్న అరెస్టుల పర్వం