రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో తక్షణమే కొవిడ్ సేవలు ప్రారంభించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం గచ్చిబౌలి ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టేందుకు వెళ్లిన సీపీఐ నాయకులను, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పోలీసులు అక్కడ అనుమతులివ్వనందున హిమాయత్నగర్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో చాడ నిరసన తెలిపారు.
'గచ్చిబౌలి టిమ్స్లో వెంటనే కొవిడ్ సేవలు ప్రారంభించాలి'
రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో తక్షణమే కొవిడ్ చికిత్స ప్రారంభించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా కొవిడ్ చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
'గచ్చిబౌలి టిమ్స్లో వెంటనే కొవిడ్ సేవలు ప్రారంభించాలి'
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున.. కరోనా వ్యాధి చికిత్సను ఆరోగ్య శ్రీ చేర్చాలని.. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని చాడ వెంకట్రెడ్డి కోరారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా కొవిడ్ చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా వైరస్ విషయంలో తగు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున చర్యలు చేపడతామని హెచ్చరించారు.