తెలంగాణ

telangana

ETV Bharat / state

వేములవాడ రాజన్నకు ముస్లిం సోదరి కోడె మొక్కులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగింది. ఆరుద్ర నక్షత్రోత్సవమున స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

By

Published : Jan 26, 2021, 3:46 PM IST

రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకున్న ముస్లిం మహిళ
రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకున్న ముస్లిం మహిళ

రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆరుద్ర నక్షత్రోత్సవమున మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, సదస్యం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. మంథనికి చెందిన ముస్లిం భక్తురాలు అప్సర్ శాసిత రాజన్నను దర్శించుకుని... స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకున్నారు.

ఇదీ చూడండి:ఫిల్మ్​సిటీలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన రామోజీరావు

ABOUT THE AUTHOR

...view details