పెద్దపల్లి జిల్లాలోని మంథని ఠాణాలో నార్త్ జోన్ ఐజీ వై.నాగిరెడ్డి వార్షిక తనిఖీలు చేపట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణను, 5s అమలు చేసిన తీరును సిబ్బంది విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఠాణా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ప్రతి పోలీస్ విధి నిర్వహణలో క్రమశిక్షణతో మెలగాలన్నారు. పోలీస్ శాఖలో ఉపయోగిస్తున్న అధునాతన టెక్నాలజీ గురించి అధికారులకు, సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని అన్నారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు, అక్రమ దందాలు, అక్రమ రవాణాలపై నిఘా పెంచాలని ఆదేశించారు. ఠాణాకు వచ్చే బాధితులతో మర్యాదగా నడుచుకోవాలని చెప్పారు.
రియాక్టివ్ పోలీసింగ్ కంటే... ప్రొయాక్టివ్ పోలీసింగే ఉత్తమం
సంఘటన జరిగిన తర్వాత స్పందించే రియాక్టివ్ పోలీసింగ్ కంటే... ముందే పసిగట్టి నివారించగలిగే ప్రొయాక్టివ్ పోలీసింగ్ ఉత్తమమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గ్రామాల్లో గస్తీ పెంచాలన్నారు. పాత నేరగాళ్లపై నిఘా ఉంచాలన్నారు. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, మంథని ఠాణాలో తగినంత సిబ్బంది లేకపోవడం... పని చేయడానికి వచ్చిన సిబ్బంది ఇక్కడ విముఖత చూపుతున్నారని అన్నారు. సరిపడ సిబ్బందికి పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఉమెన్ సేఫ్టీకి భంగం కలిగిస్తే సహించేదే లేదు...