తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో 12 మందికి గాయాలు - road accident near peddapalli

టవేరా వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటన పెద్దపల్లి శివారులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో 12 మందికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో 12 మందికి గాయాలు

By

Published : Jan 11, 2020, 11:55 PM IST

పెద్దపల్లి పట్టణ శివారులో రాజీవ్‌ రహదారి దాటుతున్న టవేరా వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ కుటుంబం... వేములవాడ దైవ దర్శనానికి వెళ్లి శనివారం సాయంత్రం తిరుగు పయణమయ్యారు. పెద్దపల్లి శివారులో రోడ్డు దాటుతుండగా... గోదావరిఖని వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. క్షతగాత్రులను స్థానికులు ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో 12 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details