తెలంగాణ

telangana

ETV Bharat / state

రోకలి కర్రతో మోది భర్తను చంపిన భార్య

పదేళ్లు విదేశాల్లోనే ఉన్నాడు. రెండు నెలల క్రితమే ఇంటికి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి రోజూ ఇంట్లో గొడవలే. విసిగిపోయిన భార్య... రోకలి కర్రతో మోది భర్తను హతమార్చిన ఘటన నిజామాబాద్​ జిల్లా ఎల్లారెడ్డిపల్లిలో జరిగింది.

By

Published : Jul 8, 2019, 1:41 PM IST

WIFE MURDERED HER HUSBAND

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో భర్త వేధింపులు తాళలేక తలపై రోకలితో మోది హత్య చేసింది ఓ వివాహిత. నాయిడి గంగారాం(54) కుటుంబ పోషణకై పదేళ్ల పాటు గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. 2 నెలల క్రితమే ఇంటికి తిరిగి వచ్చాడు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె కాగా... అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి విడిగా ఉంటున్నారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పూట మద్యం సేవించి తన భర్త కొట్టేందుకు వచ్చాడని నిందితురాలు తెలిపింది. విసుగు చెంది రోకలి కర్రతో బాది చంపినట్లు భార్య సాయవ్వ పోలీసులకు వివరించింది. తన సోదరుడు మంచి వాడని, అన్యాయంగా కొట్టి చంపిందని మృతుడి సోదరి గంగవ్వ ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.

రోకలి కర్రతో మోది భర్తను చంపిన భార్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details