నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో కరోనా సోకి ఇద్దరు మృతి చెందారు. ఐకేపీలో ఏపీఎమ్గా విధులు నిర్వహిస్తున్న ఉమాకాంత్కు కొద్ది రోజుల కిందట కొవిడ్ బారిన పడ్డారు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అతని తండ్రి రెండు రోజుల క్రితం కరోనా బారిన పడి మృతి చెందారు.
డిచ్పల్లిలో కరోనా బారిన పడి ఇద్దరు మృతి
నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులతో పాటు కొవిడ్ మరణాలు స్థానికులను కలవరానికి గురిచేస్తున్నాయి. డిచ్పల్లి మండలంలో ఈ రోజు కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందారు.
డిచ్పల్లిలో కరోనాతో ఇద్దరు మృతి
మండల పరిధిలోని బర్దిపూర్ మాజీ సర్పంచ్ నిరాడి నందుబాబుకు ఇటీవలే కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. హోమ్ క్వారెంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. నందుబాబు నిద్రపోతుండగా ఆలస్యంగా లేస్తాడులే అనుకుని.. కాసేపయ్యాక కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లి చూస్తే అప్పటికే ఆయన చనిపోయారు. ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:'ప్రభుత్వానికి ఎన్నికలమీదున్న సోయి ప్రజల ప్రాణాలపై లేదు'