నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆహ్మద్ సొంత ఖర్చులతో అంబులెన్స్ను ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో వాహనం సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'గిఫ్ట్ ఏ స్మైల్' పేరిట అంబులెన్స్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రారంభం చేశారు.
ఇబ్బందులను అధిగమించేందుకే...
కొవిడ్- 19 వ్యాప్తి నిర్మూలనలో భాగంగా నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం బోధన్ ఎమ్మెల్యే అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. మరో రెండు అంబులెన్సులు మున్సిపాలిటీ ద్వారా అందజేస్తున్నామన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించారు.
ఇవీ చూడండి : శిథిలావస్థలో ఉన్న భవనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ కమిషనర్