తెలంగాణ

telangana

సొంత ఖర్చులతో అంబులెన్స్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే షకీల్

By

Published : Aug 15, 2020, 5:53 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ సొంత ఖర్చులతో అంబులెన్స్​ను ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో వాహనం సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా 'గిఫ్ట్ ఏ స్మైల్' పేరిట న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రారంభం చేశారు.

సొంత ఖర్చులతో అంబులెన్స్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే షకీల్
సొంత ఖర్చులతో అంబులెన్స్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే షకీల్

నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆహ్మద్ సొంత ఖర్చులతో అంబులెన్స్​ను ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో వాహనం సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'గిఫ్ట్ ఏ స్మైల్' పేరిట అంబులెన్స్​ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రారంభం చేశారు.

ఇబ్బందులను అధిగమించేందుకే...

కొవిడ్- 19 వ్యాప్తి నిర్మూలనలో భాగంగా నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం బోధన్ ఎమ్మెల్యే అంబులెన్స్​ను ఏర్పాటు చేశారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. మరో రెండు అంబులెన్సులు మున్సిపాలిటీ ద్వారా అందజేస్తున్నామన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించారు.

ఇవీ చూడండి : శిథిలావస్థలో ఉన్న భవనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్​ఎంసీ కమిషనర్

ABOUT THE AUTHOR

...view details