తెలంగాణ

telangana

By

Published : Oct 27, 2020, 1:21 AM IST

ETV Bharat / state

ఇందూరులో వైభవంగా దుర్గామాత శోభాయాత్ర

నిజామాబాద్ నగరంలో దుర్గా మాత శోభయాత్ర వైభవంగా సాగింది. భక్తులు దేవి మాత నిమజ్జనం కోసం గంగమ్మ ఒడికి తరలించారు.

Durgamata Shobhayatra in Nizamabad
ఇందూరులో వైభవంగా దుర్గామాత శోభాయాత్ర

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో విశేష పూజలు అందుకున్న నవ దుర్గా మాత శోభయాత్ర నిజామాబాద్ నగరంలో వైభవంగా సాగింది. భవానీ భక్తులు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేసి దేవి మాత నిమజ్జనం కోసం గంగమ్మ ఒడికి తరలించారు.

జై బోలో దుర్గా మాత అంటూ అమ్మవారిని సేవిస్తూ శోభ యాత్ర చేపట్టారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తూ పూజలు అందుకుంది. అమ్మవారి శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది.

సంబంధిత కథనాలు:షేర్​చాట్​లో వీడియో తీస్తుండగా ప్రమాదం...

ABOUT THE AUTHOR

...view details