తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో భాజపా ఆత్మ నిర్భర్​ భారత్​ కార్యక్రమం

భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా నిజామాబాద్​లో ఆత్మ నిర్భర్​ భారత్​ కార్యక్రమం చేపట్టింది. ఇంటింటా తిరుగుతూ మోదీ రాసిన సందేశంతో కూడిన లేఖలను ప్రజలకు అందించారు. వేల్పూర్​లో ఎంపీ అర్వింద్​ అందజేశారు.

By

Published : Jun 11, 2020, 2:57 PM IST

నిజామాబాద్​లో భాజపా ఆత్మ నిర్భర్​ భారత్​ కార్యక్రమం
నిజామాబాద్​లో భాజపా ఆత్మ నిర్భర్​ భారత్​ కార్యక్రమం

ఎన్డీఏ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు నిజామాబాద్ జిల్లా ఆత్మ నిర్భర్​ భారత్​ కార్యక్రమం చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ రాసిన సందేశంతో కూడిన లేఖలను ఇంటింటికి తిరిగి అందించారు.

జిల్లాలోని వేల్పూర్​లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఇంటింటికీ తిరిగి భాజపా ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. మోదీ రాసిన లేఖలను అందించారు. నిజామాబాద్​కు కేంద్రం పసుపు బోర్డు కంటే అదనపు ప్రయోజనాలు కల్పించిందని.. ఈ విషయం రైతులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు. కొద్దిరోజుల్లోనే దీని ఫలితం కనిపిస్తుందని చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి:జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!

ABOUT THE AUTHOR

...view details