తెలంగాణ

telangana

By

Published : Jul 28, 2020, 4:24 PM IST

ETV Bharat / state

పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న దొంగల ముఠా అరెస్టు

పలు దొంగతనం కేసుల్లో పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న దొంగల ముఠాను ఆర్మూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఆరున్నర లక్షల సొత్తును రికవరీ చేశారు.

Armor police in Nizamabad district have arrested a gang of robbers
పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న దొంగల ముఠా అరెస్టు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసి యదేచ్ఛగా తిరుగుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.6.5 లక్షల సొత్తును రికవరీ చేసినట్టు ఏసీపీ రఘు వెల్లడించారు.

నిందితుల నుంచి రూ.5 వేల నగదు, సుమారు 12 తులాల బంగారం, ఒక మోటార్ సైకిల్​ను స్వాధీనపరుచుకున్నారు. వారిని పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్‌ కేసులు

ABOUT THE AUTHOR

...view details