నిర్మల్ జిల్లా భైంసాలోని పంజాశ గల్లీకి చెందిన అబ్దుల్ హైమద్(75) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ... ఈరోజు మృతి చెందాడు. భర్త మరణ వార్త విన్న హైమాది బేగం(68) గుండెపోటుతో చనిపోయింది.
'వారి బంధాన్ని చావు కూడా విడదీయలేకపోయింది' - wife and husband died in nirmal district
కష్టసుఖాలను కలిసి పంచుకున్న ఆ వృద్ధ దంపతులను... చావు కూడా విడదీయలేక పోయింది. భర్త మరణ వార్త విని తట్టుకోలేక భార్య తనువు చాలించిన ఘటన నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం నింపింది.

'వారి బంధాన్ని చావు కూడా విడదీయలేకపోయింది'
ఈ నెల 13న భైంసాలో జరిగిన అల్లర్లలో ఇద్దరు కొడుకుల అరెస్టు, భర్త మరణంతో తీవ్రంగా కుంగిపోయిన హైమాదిబేగం గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు.
'వారి బంధాన్ని చావు కూడా విడదీయలేకపోయింది'
ఇదీ చూడండి:'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్ పిటిషన్
Last Updated : Jan 29, 2020, 5:20 PM IST