పేద ప్రజలకు ఇళ్లు కట్టించాకే తాను సొంత ఇల్లు కట్టుకుంటానని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో భాజపా అభ్యర్థి తరఫున పురపాలక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులతో మాట్లాడి పలు సమస్యలపై ఆరా తీశారు.
పేదలకు ఇళ్లు కట్టించాకే.. నేను ఇల్లు కట్టుకుంటా..!
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎంపీ సోయం బాపూరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భాజపా అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాలని కోరారు.
తమకు ఓటు వేయకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివ్వమని తెరాస నేతలు.. ప్రజలను బెదిరిస్తున్నారని ఎంపీ విమర్శించారు. కేంద్రం నిధులతో పట్టణాన్ని అభివృద్ధి చేసి.. తామే చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుందన్నారు. అందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు అందజేస్తామని చెప్పి, పట్టణంలో ఇప్పటికీ ఏ ఒక్కరికీ ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: మహాత్మునికి భారతరత్న కోరిన పిటిషన్ తిరస్కరణ