అడవుల్లో ఉండాల్సిన వానరాలు.. ఆహారం కోసం గ్రామాలు, రహదారుల బాట పడుతున్నాయి. రైతులు ధాన్యాన్ని విక్రయించడానికి ట్రాక్టర్ల ద్వారా మార్కెట్కు తరలిస్తున్నప్పుడు రహదారిపై పడే గింజల కోసం నిర్మల్ జిల్లా లోలం సమీపంలో వందల సంఖ్యలో వానరాలు ఇలా వరుసకట్టి నిరీక్షిస్తున్నాయి. రహదారి పైకి పరుగెత్తే క్రమంలో కొన్ని వానరాలు ప్రమాదాలకు గురై ప్రాణాలు వదులుతున్నాయి.
ఆహారం కోసం.. వానర ప్రయాస!
అడవుల్లో ఆహారం దొరకక వానరాలు రహదారుల బాట పడుతున్నాయి. గ్రామాల్లోనూ వీటి సంచారం విపరీతంగా పెరిగింది. రైతులు ధాన్యాన్ని తరలిస్తున్న క్రమంలో రోడ్లపై పడే గింజల కోసం నిరిక్షిస్తున్నాయి. ఆహారం కోసం అవి పడే అవస్థలు ఈ పొటోతో అర్థం చేసుకోవచ్చు.
ఆహారం కోసం.. వానర ప్రయాస!