తెలంగాణ

telangana

ETV Bharat / state

షాదీ ముబారక్​, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నిర్మల్​ జిల్లా ముధోల్​ ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే విఠల్​రెడ్డి షాదీ ముబారక్​, కల్యాణిలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రైతుల సంక్షేమ కొరకు రాష్ట్ర సర్కారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను విరివిగా ప్రారంభిస్తోందని ఎమ్మెల్యే అన్నారు.

By

Published : Apr 30, 2020, 7:52 PM IST

mla vittalreddy cheques distribution in nirmal district
షాదీ ముబారక్​, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు అండగా నిలిచిందని శాసనసభ్యులు విఠల్​రెడ్డి అన్నారు రైతుల సంక్షేమం కొరకు సర్కారు కట్టుబడి ఉందని... ప్రభుత్వపరంగా కొనుగోలు కేంద్రాలను విరివిగా ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వలస కూలీల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాకపోకలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఈ సదుపాయాన్ని వలస కూలీలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details