తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలి' - LOCK DOWN EFFECTS

నిర్మల్​లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, పోలీసులు, జర్నలిస్టులకు మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి మజ్జిగ ప్యాకెట్లు పంచారు. పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.

MINISTER INDRAKARAN REDDY DISTRIBUTED BUTTERMILK PACKETS IN NIRMAL
'పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలి'

By

Published : Apr 16, 2020, 5:00 PM IST

కరోనా వైరస్ బాధితులు, పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు దాతలు వీరోచితంగా సాయం చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్​లో విజయ డైరీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బందికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

కరోనా వైరస్ బాధితులు, ఆర్థికంగా చితికిపోయిన వారికి దాతలు ముందుకు వచ్చి సాయం అందించాలని కోరారు. నిర్మల్​ జిల్లాను రెడ్​జోన్​గా ప్రకటించినందున ప్రజలంతా ఇళ్లలోనే ఉండి సహకరించాలని కోరారు. జిల్లాలో లాక్​డౌన్​ను పోలీసుశాఖ పగడ్బందీగా అమలు చేస్తోందన్నారు.

నిత్యవసర వస్తువుల కోసం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు వాహనాల ద్వారా పదివేల ప్యాకెట్లను వాహనాల ద్వారా అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

'పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలి'
'పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలి'

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details