తెలంగాణ

telangana

'నిర్మల్ జిల్లా కేంద్రంలో భాజపా సంబురాలు'

By

Published : Nov 10, 2020, 6:42 PM IST

దుబ్బాకలో భాజపా అభ్యర్థి రఘునందన్​రావు గెలుపుతో నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.

'దుబ్బాకలో భాజపా గెలుపు తెరాసకు చెంపపెట్టు'
'దుబ్బాకలో భాజపా గెలుపు తెరాసకు చెంపపెట్టు'

దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు తెరాసకు చెంపపెట్టని భాజపా నేతలు అన్నారు. రఘునందన్​రావు గెలుపుపై నిర్మల్​ జిల్లా కేంద్రంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో మార్పు మొదలైందని రాబోయే రోజుల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురడం ఖాయమన్నారు.

ఇదీ చూడండి:కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్​ రావు

ABOUT THE AUTHOR

...view details