నారాయణపేట జిల్లా పరిధిలో ఇటీవల నూతనంగా ఏర్పడిన మైక్రో హనుమాన్ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురయ్యాడు. గ్రామానికి చెందిన చిన్న నాయక్ ప్రమాదవశాత్తు లెవెన్ కేవీ విద్యుత్ తీగలను పట్టుకొని అక్కడికక్కడే పడిపోయాడు. విషయం గుర్తించిన గ్రామస్థులు చిన్న నాయక్ని నారాయణపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తండాలో విద్యుదాఘాతం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
నారాయణపేట జిల్లా పరిధిలోని మైక్రో హనుమాన్ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
తండాలో విద్యుదాఘాతం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు చిన్న నాయక్ ఎడమచేతిని మోచేయి వరకూ తొలగించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతను హైదరాబాద్లోనే చికిత్స పొందుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన అతడిని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:ఆదివారం కరోనా పరీక్షలకు ఆటంకం.. మూడొంతుల కేంద్రాల మూత