కొత్త జిల్లాకు రెండో కలెక్టర్గా అడుగుపెట్టిన ఆమె పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.. బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే జిల్లా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడుతూ మన్ననలు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతిష్ఠాత్మక ప్రధానమంత్రి ఇన్నోవేషన్ అవార్డు-2020 జాబితాలో చోటుదక్కించుకున్నారు నారాయణపేట జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కృషిచేసే జిల్లా పాలనాధికారులకు పీఎం ఇన్నోవేషన్ అవార్డు అందిస్తారు. 2018లో బెటర్ ఇండియా పత్రిక ప్రకటించిన 10 మంది ప్రభావశీల ఐఏఎస్లలోనూ హరిచందన చోటు దక్కించుకున్నారు.
తక్కువ సమయంలోనే..
2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన హరిచందన జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్గా పని చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన నారాయణపేట జిల్లా కలెక్టర్గా బదిలీపై వచ్చారు. వెనుకబడిన జిల్లాగా పేరొందిన నారాయణపేటలో తక్కువ సమయంలో పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా మహిళా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మహిళాల ఆత్మగౌరవం కోసం ‘మొబైల్ షీ టాయిలెట్’ను కోస్గి పురపాలికలో ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ నుంచి అభినందనలు పొందారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో ఇలాంటి టాయిలెట్లు ఏర్పాటుచేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
జీహెచ్ఎంసీలోనూ..