రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. సమ్మెలో భాగంగా రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలకు కార్మిక నాయకులు వినతిపత్రం ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో నల్గొండ జడ్పీ కార్యాలయం వద్ద పోలీసులు కార్మిక నాయకులను అడ్డుకున్నారు. ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
జడ్పీ కార్యాలయం వద్ద వాగ్వాదం, తోపులాట - The police at the Nalgonda Judge's Office blocked the labor leaders
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల కార్మికులకు మద్దతుగా ప్రజా సంఘాల నాయకులు నల్గొండ జడ్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
![జడ్పీ కార్యాలయం వద్ద వాగ్వాదం, తోపులాట](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4842533-244-4842533-1571815688469.jpg)
జడ్పీ కార్యాలయం వాగ్వాదం, తోపులాట