తెలంగాణ

telangana

By

Published : Oct 20, 2020, 9:45 PM IST

ETV Bharat / state

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కంచర్ల

నల్గొండ జిల్లా కనగల్​ మండలంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పర్యటించారు. పలు గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు ప్రారంభించి, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

nalgonda mla kancharla bhupalreddy distribute bhtukmma sarees in regatte
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కంచర్ల

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దన్నారు. కనగల్​ మండలంలో పర్యటించి, పలు గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు ప్రారంభించారు. బతుకమ్మ చీరలు పంపిణీి చేశారు.

మండల పరిధిలోని రేగట్టెలో సర్పంచి కడారి కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ ఛైర్మన్​ వంగాల సహదేవ రెడ్డి, ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ సభ్యుడు చిట్ల వెంకటేశం, రేగట్టె ఎంపీటీసీ పాలకూరి పుష్పలత వెంకటేశం, సింగిల్​ విండో డైరెక్టర్ యర్రోళ్ల యల్లయ్య, పలు గ్రామాల సర్పంచ్​లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:సుజాతను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి: హరీష్​రావు​

ABOUT THE AUTHOR

...view details