నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి..
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. త్రిపురారం మండలం అంజనపల్లి, నిడమనూరు మండలం సురేపల్లిలో సుమారు 100 మంది జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
నాగార్జునసాగర్లో జానారెడ్డి ప్రచారం
త్రిపురారం మండలం అంజనపల్లి, నిడమనూరు మండలం సురేపల్లిలో సుమారు 100 మందికి కాంగ్రెస్ కండువా కప్పారు. సురేపల్లి పల్లిలో కాంగ్రెస్ శ్రేణులు జానారెడ్డికి కోలాటం బృంద సభ్యుల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు.