తెలంగాణ

telangana

సైనికుల త్యాగాలు వృథా కానివ్వొద్దు: జానారెడ్డి

By

Published : Jun 26, 2020, 6:25 PM IST

కాంగ్రెస్​ సలాం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా హాలియాలో మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి... వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం సైనికులు చేసిన ప్రాణ త్యాగాలను వృథాగా పోనివ్వొద్దని కోరారు.

ex clp leader janareddy paid tribute to soldiers in haliya
ex clp leader janareddy paid tribute to soldiers in haliya

భారత్- చైనా సరిహద్దులో జరిగిన దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి నివాళులర్పించారు. "కాంగ్రెస్ సలాం" పేరిట నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా హాలియాలోని తన నివాసంలో సైనికుల చిత్రపటాలకు పూలమాలలు వేసి... మౌనం పాటించి నివాళులర్పించారు.

భారత సరిహద్దుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న వీర జవాన్లకు శిరసు వంచి నమస్కరిస్తున్నామని జానారెడ్డి తెలిపారు. దేశ రక్షణ కోసం సైనికులు చేసిన ప్రాణ త్యాగాలు వృథా కాకుండా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని జానారెడ్డి పేర్కొన్నారు.

ఇవీచూడండి:శానిటైజర్లా..శనిటైజర్లా..? మార్కెట్​లో నాసిరకం అమ్మకాలు

ABOUT THE AUTHOR

...view details