తెలంగాణ

telangana

By

Published : Jun 28, 2020, 8:06 AM IST

ETV Bharat / state

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం వరకు తక్కువగా ఉన్న కేసులు ఒక్కసారిగా పదుల సంఖ్యలో బయట పడుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 60కి చేరుకున్నాయి.కేసులు పెరుగుతున్నా కొద్ది ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Corona Positive Cases Increased in Nalgonda District
ఉమ్మడి నల్గొండలో..  పెరుగుతున్న కరోనా కేసులు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు కొత్తగా 25 కేసులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నమోదయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2, సూర్యాపేటలో ఒక కేసు నమోదు కాగా.. నల్గొండ పట్టణంలోనే 21 కేసులు వెలుగు చూశాయి. మిర్యాలగూడ, నకిరెకల్​ మండలాల్లో రెండేసి కేసులు బయటపడ్డాయి. ఎక్కువ కేసుల్లో పోలీసు శాఖకు సంబంధించినవారే ఉన్నారు. జిల్లాలో 35గా ఉన్న కరోనా కేసుల సంఖ్య.. తాజా కేసులతో 60కి చేరుకుంది. సూర్యాపేటలో కరోనా బారిన పడి 80 సంవత్సరాల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది.

ABOUT THE AUTHOR

...view details