రంజాన్ మాసం దృష్ట్యా మసీదుల్లో ముగ్గురికి మించి ప్రార్థనల్లో పాల్గొనొద్దని ముస్లిం పెద్దలకు నాగర్కర్నూల్ జిల్లా డీఎస్పీ మోహన్రెడ్డి సూచించారు. నాగర్కర్నూల్లోని పీఎస్ ఆవరణలో ముస్లిం మత పెద్దలు, మసీద్ కమిటీ బాధ్యులతో సమావేశం నిర్వహించారు.
'రంజాన్ మాసంలో లాక్డౌన్ నిబంధనలు తప్పనిసరి'
రంజాన్ మాసంలో లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని నాగర్కర్నూల్ జిల్లా డీఎస్పీ మోహన్రెడ్డి జిల్లాలోని ముస్లిం మత పెద్దలకు విజ్ఞప్తి చేశారు.
'రంజాన్ మాసంలో లాక్డౌన్ నిబంధనలు తప్పనిసరి'
కరోనా మహమ్మారి వ్యాపిస్తున్నందున ఇఫ్తార్ విందులు, సామూహిక ప్రార్థనలు చేయరాదని, ఇళ్లలోనే నమాజ్ చేయాలని కోరారు. ఇది కేవలం కరోనా కబంద హస్తాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికేనని తెలిపారు. ముస్లిం సోదరులంతా నిబంధనలు పాటించే విధంగా మతపెద్దలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.