తెలంగాణ

telangana

By

Published : May 1, 2020, 8:13 PM IST

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకుల మృతి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి తండ్రీకొడుకులు మృతి చెందిన ఘటన నాగర్​కర్నూల్​ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

నాగర్​కర్నూల్​ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలూ నాయక్(49), అతని కుమారుడు మహేశ్​ (16) మృతి చెందారు. యాపట్ల గ్రామానికి చెందిన బాలూనాయక్​ పని నిమిత్తం తన భార్య, కుమారునితో కలిసి మారేడ్ మాన్ దినే గ్రామానికి ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. వాహనంపై వేగంగా వెళ్తుండడం వల్ల మూల మలుపు వద్ద అదుపు తప్పి ఎదురుగా ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో వారిద్దరు అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాలను చూసి వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details